నమిత న్యూస్ - Andhra Pradesh / ఎన్టీఆర్ ( విజయవాడ ) : విజయవాడ - ఫిబ్రవరి 07 : ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 01.01.2026 తేదీ ని అర్హత తేదీగా తీసుకుని అసెంబ్లీ ఓటరు జాబితాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాలు తయారు చేయాలని సూచించిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్. సిద్ధమైన ఓటరు జాబితాలను 09.03.2026 న ప్రచురించాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఈ ప్రక్రియ చేపట్టబడుతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
Admin
Namitha News