Sunday, 26 July 2026 09:15:11 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తాగునీటి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయండి - జడ్పి సీ.ఈ.వో. రవి కుమార్ నాయుడు

Date : 18 February 2026 10:43 PM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 18 : తంబళ్లపల్లె మండలంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి నిధుల సమస్య లేదని యుద్ధ ప్రాతిపదికన పరిష్కార చర్యలు చేపట్టాలని జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు సూచించారు. బుధవారం ఆయన తంబళ్లపల్లె మండల పరిషత్ కార్యాలయంలో డి ఎల్ డి ఓ అమర్నాథ్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. తంబళ్లపల్లె మోడల్ స్కూల్ లో చేపట్టిన ప్రకృతి వ్యవసాయంపై సంతృప్తి చెంది అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా తంబళ్లపల్లెలో ఓవర్ హెడ్ ట్యాంక్, మల్లయ్య కొండపై మరుగుదొడ్లు నిర్మాణాలు, తంబళ్లపల్లె మండల కేంద్రంలో మహిళలకు మరుగుదొడ్లు నిర్మాణాలకు ప్రాధాన్యత నివ్వాలని ఆర్డబ్ల్యూఎస్ వినోద్ కుమార్ కు సూచించారు. మండలంలో తాగునీటి పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రజలకు అవసరమైన పనులను వెంటనే చేపట్టాలన్నారు. జల జీవన్ మిషన్ పనుల నిర్వహణలో అధికారులు కీలక పాత్ర పోషించి భవిష్యత్తులో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా పరిషత్, మండల అభివృద్ధి నిధులు, పంచాయితీ నిధులు ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పనులు చేయడంలో రాజీ పడొద్ద న్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు ప్రజల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా,డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, ఏఈఈ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: