నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 18 : తంబళ్లపల్లె మండలంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి నిధుల సమస్య లేదని యుద్ధ ప్రాతిపదికన పరిష్కార చర్యలు చేపట్టాలని జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు సూచించారు. బుధవారం ఆయన తంబళ్లపల్లె మండల పరిషత్ కార్యాలయంలో డి ఎల్ డి ఓ అమర్నాథ్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. తంబళ్లపల్లె మోడల్ స్కూల్ లో చేపట్టిన ప్రకృతి వ్యవసాయంపై సంతృప్తి చెంది అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా తంబళ్లపల్లెలో ఓవర్ హెడ్ ట్యాంక్, మల్లయ్య కొండపై మరుగుదొడ్లు నిర్మాణాలు, తంబళ్లపల్లె మండల కేంద్రంలో మహిళలకు మరుగుదొడ్లు నిర్మాణాలకు ప్రాధాన్యత నివ్వాలని ఆర్డబ్ల్యూఎస్ వినోద్ కుమార్ కు సూచించారు. మండలంలో తాగునీటి పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రజలకు అవసరమైన పనులను వెంటనే చేపట్టాలన్నారు. జల జీవన్ మిషన్ పనుల నిర్వహణలో అధికారులు కీలక పాత్ర పోషించి భవిష్యత్తులో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా పరిషత్, మండల అభివృద్ధి నిధులు, పంచాయితీ నిధులు ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పనులు చేయడంలో రాజీ పడొద్ద న్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు ప్రజల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా,డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, ఏఈఈ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News