నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 26 : తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లి పంచాయతీలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలం లో నిర్మాణానికి అడ్డుపడుతున్నారని ఓ వికలాంగుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగిరెడ్డిపల్లికి చెందిన భాగాల మల్లప్ప నాయుడు కు ప్రభుత్వం సర్వేనెంబర్ 73 లో ప్లాట్ నెంబర్ 2 ఇంటి స్థలంతో పాటు పట్టా మంజూరు చేసి రెవిన్యూ అధికారులు సైతం క్షేత్రస్థాయి సర్వేలో మల్లప్ప నాయుడు స్థలాన్ని ధ్రువీకరించారు.అందులో మల్లప్ప నాయుడు పునాది సైతం నిర్మించుకొని పక్కా ఇల్లు నిర్మించుకుంటుండగా గ్రామానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు అడ్డుకున్నారు. మల్లప్ప నాయుడుకు రెవిన్యూ అధికారుల ధ్రువపత్రం తోపాటు ఈ పట్టాపై పక్కా ఇల్లు సైతం మంజూరు అయింది. ఈ విషయమై శుక్రవారం వికలాంగుడు మల్లప్ప నాయుడు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Reporter
Namitha News