నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 19 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వారు ఎంఐటిఎస్-ఐపిఎఫ్సి, మదనపల్లె మద్దతుతో “మదనపల్లె పట్టు మరియు పట్టు చీరల” కోసం భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ దరఖాస్తు సమర్పించబడింది అని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టు మరియు పట్టు చీరలు వాటి ఉన్నతమైన నాణ్యత, మెరుపు మరియు తేలికపాటి అల్లికకు ప్రసిద్ధి చెందాయి అని, ఈ వస్త్రాలను సాంప్రదాయ మగ్గాలపై నేస్తారని మరియు ఇవి క్లిష్టమైన డిజైన్లు మరియు ప్రకాశవంతమైన రంగులతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి అని అన్నారు. ఈ ప్రాంతపు విలువైన ఉత్పత్తుల యొక్క ప్రత్యేక గుర్తింపును పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన చర్యగా, ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెకు చెందిన శ్రీ చౌడేశ్వరి సిల్క్ చీరల సొసైటీ, చెన్నైలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ, ఐపిఆర్ కార్యాలయంలో “మదనపల్లె పట్టు మరియు పట్టు చీరల” కోసం అధికారికంగా భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకుంది అని అన్నారు. “మదనపల్లె పట్టు మరియు పట్టు చీరలను” మదనపల్లె ప్రాంతానికి ప్రత్యేకంగా ముడిపడి ఉన్న ఒక ప్రత్యేక ఉత్పత్తిగా గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ దరఖాస్తును, జిఐ ట్యాగ్ ప్రక్రియకు చట్టపరమైన ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (ఎంఐటిఎస్) ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (ఐపిఎఫ్సి), మదనపల్లె యొక్క చట్టపరమైన మద్దతుతో దాఖలు చేశారు అని అన్నారు. ఈ సందర్బంగా శ్రీ చౌడేశ్వరి సిల్క్ చీరల సొసైటీ ప్రతినిధి, కార్యదర్శి ఎం. రాజా నారాయణ మాట్లాడుతూ జిఐ రక్షణ సాంప్రదాయ ఉత్పత్తి మరియు తయారీ ప్రక్రియకు సహాయపడుతుందని, రైతులు, నేత కార్మికులు, తయారీదారుల జీవనోపాధిని మెరుగుపరుస్తుందని, ఈ జిఐ గుర్తింపు ద్వారా మదనపల్లె ప్రాంతం ప్రయోజనం పొందుతుందని మరియు ఈ అసాధారణ ఉత్పత్తుల ప్రత్యేకతను కాపాడుతుందని మేము నమ్ముతున్నాము అని అన్నారు. ప్రో ఛాన్సుల్లేర్ యెన్. ద్వారకానాథ్ మాట్లాడుతూ రైతులు, నేత కార్మికులు, తయారీదారులు జిఐ ట్యాగ్ యొక్క సంభావ్య ప్రయోజనాలపై ఆశాభావంతో ఉన్నారు అని, మదనపల్లెలోని MITS-IPFC మద్దతుతో మరియు శ్రీ చౌడేశ్వరి సిల్క్ శారీస్ సొసైటీ యొక్క సామూహిక ప్రయత్నాలతో, మదనపల్లె పట్టు మరియు పట్టు చీరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ఉజ్వల భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్నాయి అని ఆశాభావ వ్యకతం చేసారు. కార్యక్రమం లో అడ్విసెర్ ఆర్&డి డాక్టర్ తులసీరామ్ నాయుడు అసోసియేట్ డీన్ ఆర్ & డి డాక్టర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు. .
Reporter
Namitha News