నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మే 16 : ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మండలంలోని గుండ్లపల్లి పంచాయతీ లో పోర్డు సంస్థ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో అవగాహన పొందిన రైతు నరసింహులు క్రిమిసంహారక మందులు లేకుండా పూర్తిగా కషాయాలు, జీవన ఎరువుల తో మామిడి పంట పండించి సత్ఫలితాలు సాధించాడు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా పండించిన మామిడి కాయలతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని గ్రహించిన అధికారులు, రైతులు, వ్యాపారులు ఆ కాయలు కొనడానికి ఎగబడుతున్నారు. ప్రకృతి కషాయాలతో పండించిన మామిడి రైతు నరసింహులు తన పంటకు ఇంత డిమాండ్ ఉంటుందని పోర్డు సంస్థ డైరెక్టర్ లలితమ్మ సూచనలతో భవిష్యత్తులో అన్ని పంటలు ప్రకృతి వ్యవసాయం తోనే చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తానని తెలిపారు
Reporter
Namitha News