నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహిళల విద్యతోనే సమాజం వికసిస్తుందని నమ్మిన ఆధునిక భారత దేశ మొదటి మహిళ ఉపాద్యాయురాలు సావిత్రి బాయి ఫూలే -- కొనియాడిన మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ -- వైసిపి కార్యాలయంలో ఘనంగా సావిత్రి బాయి ఫూలే 195 వ జయంతి ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే నేటి మహిళ విద్యాకు స్పూర్తిదాయకం అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. తాడిత, పీడిత ప్రజల ఆశజ్యోతి సావిత్రి బాయి పూలే 195 వ జయంతి సందర్భంగా అవెన్యూ రోడ్డు వైసిపి కార్యాలయంలో మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆద్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మహిళలు విద్యా రంగంలోను అన్ని రంగాలలో సమాన హక్కులు అవకాశాలు కల్పించాలని సావిత్రిబాయి ఫూలే ఎన్నో పోరాటాలు చేశారని వివరించారు. భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించారని, ఆమె ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని వెల్లడించారు. ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని గుర్తు చేశారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యత, మహిళల హక్కుల కోసం పోరాటం చేయటం సామాజిక బాధ్యతగా భర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అడుగుజాడల్లో నడచి నవ నిర్మాణా వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పోరాటం చేసిందని కొనియాడరు. ఆ మహనీయురాలు నాడు చేసిన మహిళ విద్యా పోరాటం నేటికి స్పూర్తిదాయకం అని వివరించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె మున్సిపల్ కౌన్సిలర్ల, వైసిపి నాయకులు, వివిధ హోదాల్లో పనిచేసే వైసిపి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News