Sunday, 26 July 2026 10:02:29 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పశు ఆరోగ్య శిబిరం లను సద్వినియోగం చేసుకోండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

ఈనెల 19 నుండి 31 వరకు జాతీయ పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్న పశుసంవర్ధక శాఖ

Date : 19 January 2026 04:08 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 19 : ఈనెల 19 నుండి 31 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే జాతీయ పశు ఆరోగ్య శిబిరాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని, పశువులకు వచ్చే పలు వ్యాధులకు మందులు మరియు టీకాల పంపిణీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం మదనపల్లి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంపై గోడ పత్రికను మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ మధుసూదనరావుతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పశువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చని తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు అన్నారు. అన్నమయ్య జిల్లాలో ఈనెల 19 నుండి 31 వరకు పశువులకు దూడలకు మరియు సన్న జీవాలకు నట్టల నివారణ మందులు ఉచితంగా త్రాపించబడతాయని, గొర్రెలు మేకలకు ఉచితంగా బొబ్బ వ్యాధి చీడపారుడు, చిటుక, నీలి నాలుక, వంటి వ్యాధులకు వ్యాధి టీకాలు ఉచితంగా అందించడం జరుగుతుందని వ్యాధులకు టీకాలు పంపిణీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ టీకాలను మరియు మందులను రైతులందరూ వినియోగించుకొని పశువులకు వచ్చే వ్యాధులు నివారించుకోవచ్చని సూచించారు. శాస్త్రీయ పశు యాజమాన్య పద్ధతులు మరియు పశువిజ్ఞానం పై అవగాహన సదస్సులు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. గోకులాలు వాటి నిర్మాణం పై అవగాహన కల్పించడం జరుగుతుందని, సంచార పశు ఆరోగ్య సేవ కేంద్రాలు నిర్వహించబడతాయని, పశు బీమా పథకం అమలు పశు కిసాన్ క్రెడిట్ కార్డు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. రైతులందరూ ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మదనపల్లి సబ్ కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదనరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై, ఆ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: