Monday, 27 July 2026 01:52:24 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

'ఉపాధి’ ని కాపాడుకుందాం - సిపిఎం జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు

Date : 20 January 2026 06:21 PM Views : 299

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 'ఉపాధి’ ని కాపాడుకుందాం -- సిపిఎం జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకుశ చర్యలను నిరసించాలని, కార్మికులందరూ ఐక్యంగా ఉండి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని సిపిఎం జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు కోరారు. ఇంటింటికీ ప్రచార కార్యక్రమం సందర్బంగా ఇళ్ల వద్దకెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. మదనపల్లి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో విబిజి ఆర్‌ఎఎం జి చట్టం తీసుకు రావడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని కార్మికులకు పనులు లభించక వలసలు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసే క్రమంలో భాగంగా కేంద్రం క్రమక్రమంగా పనులను తగ్గిస్తూ, కూలి డబ్బులు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. నూతన ఉపాధి చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలపై భారం పడి క్రమంగా పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటాయని తెలిపారు. విబిజి ఆర్‌ఎఎంజి పథకాన్ని రద్దు చేసి తక్షణం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి పరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరిశర్మ, ప్రభాకర్ రెడ్డి, రఘునాథ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధిహామీ పథకాన్ని పునరుద్దరించాలంటున్న కూలీలు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :