నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -ఫిబ్రవరి 01 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్ "పూర్తిగా ప్రజా వ్యతిరేక మరియు సమాఖ్య వ్యతిరేక బడ్జెట్" గా సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అభివర్ణించారు. కేంద్ర బడ్జెట్ కొద్దిమంది ధనవంతుల మరియు పెద్ద వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసమే రూపొందించబడిందని విమర్శించారు. సామాన్య ప్రజలు, కార్మికులు మరియు సామాజికంగా వెనుకబడిన వర్గాల అవసరాలను ఈ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. వ్యవసాయం, ఉపాధి హామీ పథకాలు మరియు ఇతర సామాజిక సంక్షేమ రంగాలకు ఇచ్చే నిధులలో ప్రభుత్వం భారీగా కోత విధించిందని విమర్శించారు. ద్రవ్య క్రమశిక్షణ పేరుతో సామాన్యులకు అందాల్సిన ప్రయోజనాలను ప్రభుత్వం కుదించిందని, అదే సమయంలో కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇచ్చిందని పేర్కొన్నారు.ఈ బడ్జెట్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, రాష్ట్రాలకు చెల్లించాల్సిన నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు అంచనాల కంటే తక్కువగా ఉన్నా, ఆర్థిక మంత్రి ఆ విషయాన్ని ప్రస్తావించలేదని విమర్శించారు. 2026-27కి సంబంధించి చూపిన ఆదాయ అంచనాలు కూడా అశాస్త్రీయంగా ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం గా ఈ బడ్జెట్ "రైతులు మరియు కార్మికులపై చేసిన దాడి"గా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు సమ్మె కు పిలుపునిచ్చారని, వారి కోర్కెలను కనీసం పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకగా నిరసనలు చేపట్టాలని, ఫిబ్రవరి 12 న జరిగే సమ్మెను జయప్రదం చెయ్యాలని పిలుపునిచ్చారు.
Admin
Namitha News