నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 16 : నేడు టెక్నాలజీ మారుమూల ప్రాంతానికి సైతం విస్తరించి అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నా తంబళ్లపల్లె మండలం ముద్దలదొడ్డి ప్రజలకు కనీసం సెల్ టవర్ యోగం లేక వెనుకబడిపోయారు. సెల్ టవర్ లేక రేషన్, పింఛన్, సంక్షేమ పథకాల కోసం ఈ కేవైసీ చేయాలంటే 30 అడుగుల ఎత్తున ఉన్న గుట్ట ఎక్కాల్సిందే. ఈ పరిస్థితిపై విసిగిపోయిన ప్రజలు మంగళవారం గుట్టెక్కి సెల్ టవర్ కోసం తమ నిరసనగళం విప్పారు. ఈ సందర్భంగా టిడిపి నాయకుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా సెల్ టవర్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు
Reporter
Namitha News