నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 18 : తంబళ్లపల్లె మండలంలోని మహిళా సంఘాలకు గురువారం ఐకేపి కార్యాలయం లో రుణాల కోసం డాక్యుమెంటేషన్ కార్యక్రమం ముమ్మరంగా జరిగింది.ఉదయం ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఏపీఎం గంగాధర్, సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, భాషలు పలు మహిళా సంఘాలకు డాక్యుమెంటేషన్ పూర్తి చేసి రుణాలకు సహకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు బ్యాంకు లింకేజీ రుణాలు సద్వినియోగం చేసుకొని సకాలంలో చెల్లించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సంఘ మిత్రలు, వివో సభ్యులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News