నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 07 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లోని మసీదు వీధి, విశ్వనాధ వీధి, క్రాస్ రోడ్డు, సిద్ధారెడ్డి గారి పల్లె లలో గత మూడేళ్ల క్రితం మురికినీటి కాలువను నిర్మించారు. అయితే ఆ కాలువలపై మూతలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ప్రతినిత్యం ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇదే దారి గుండా ఈ మురికి నీటి కాలువల దుస్థితి చూసి చూడనట్లు వెళ్లడం దురదృష్టకరం. గతంలో స్పెషల్ ఆఫీసర్ స్థాయి నుండి ఎంపీడీవో స్థాయి అధికారులు ఈ సమస్య పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వ నిధులు మంజూరు అయితే నీకా నాకా అని పోట్లాడుకునే రాజకీయ నాయకులు నిత్యం వందలాదిమంది సంచరించే ఈ కాలువల పై మూతలు వేయడానికి నిధులే కరువయ్యాయని ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఇప్పటికైనా కూటమి నాయకులు స్పందించి ఈ మూరిక నీటి కాలువలపై మూతలు వేయడానికి కృషి చేయాల్సి ఉంది
Reporter
Namitha News