Sunday, 26 July 2026 10:37:16 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలు విడుదల

Date : 15 May 2026 06:00 PM Views : 117

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 15 : మదనపల్లె సమీపం అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వారు ఇంజనీరింగ్ ప్రవేశాలకొరకై నిర్వహించిన మిట్స్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను శుక్రవారం రోజున యూనివర్సిటీ ప్రో చాన్సుల్లర్ నాదెళ్ల ద్వారకానాథ్ ఆన్లైన్ ద్వారా విడుదలచేశారు. ఈ సందర్బంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సుల్లేర్ డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్ కుమార్, డైరెక్టర్ అడ్మిషన్స్ డాక్టర్ దీపాంకర్ రాయ్, సి.ఓ.ఈ డాక్టర్ సాయి కుమార్, సి.టి.ఓ సనత్ హెగ్డే, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మారుతీ ప్రసాద్ తదితరులు విడుదల కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాదెళ్ల ద్వారకానాథ్ మాట్లాడుతూ మే 3 వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు ఈ పరీక్షను సుమారు 13 సెంటర్లలో నిర్వహించినట్లు, సుమారు 5000 మంది కి పైగా విద్యార్థులు ఈ సెట్ ను రాసినట్లు ఆయన అన్నారు. యూనివర్సిటీ తరుపున టాప్ 20 ర్యాంకేర్స్ కు మెరిట్ స్కాలర్షిప్ లు అందజేయనునట్లు ఆయన అన్నారు. ఈ పరీక్షలో మదనపల్లె కు చెందిన పఠాన్ జుల్ఫికర్ ఖాన్ మొదటి ర్యాంక్ సాధించినట్లు ఆయన అన్నారు. పెదకాము రిషిత రెడ్డి కు రెండవ ర్యాంక్, నాసన్న గారి రామ్ చరణ్ రెడ్డి కు మూడవ ర్యాంక్, వాల్మీకి ఋషిక్ కు నాలగవ ర్యాంక్ పొందినట్లు ఆయన అన్నారు. ఎస్.ఎండీ. మోయిన్ కు ఐదో ర్యాంక్, పూటక హర్ష నందన్ కు ఆరవ ర్యాంక్, హెచ్.రవళిక కు ఏడవ ర్యాంక్, నల్లజాల రవిచంద్ర నాయుడు కు ఎనిమిదవ ర్యాంక్, గొర్లప్పగారి హాసిని కు తొమ్మిదవ ర్యాంక్, వేమల యతీష్ కు పదవ ర్యాంక్ లభించినట్లు ఆయన అన్నారు. కమ్ములూరి తబసుమ్, నవదీప్ తేజ, వి మహాలక్ష్మి, జయవర్ధన్ జె యెన్, కొండా భాను తేజ, విరూపాక్షి తేజస్విని, షేక్ సమీనా, కేసర్ల మురారి, షేక్ మహమ్మద్ జుబేర్, మరియు ఫసీహా ఫాతిమా పరికీ సయ్యద్ లు వరుసగా 11వ ర్యాంక్ నుంచి 20వ ర్యాంక్ వరకు నిలిచినట్లు ఆయన అన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సుల్లేర్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ యూనివర్సిటీ సెట్ రాసి టాప్ లో నిలిచిన టాప్ 20 విద్యార్థులకు మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్ధి కి 100 శాతం ఫీజు స్కాలర్షిప్ నాలుగు సంవత్సరాలు అందజేస్తామని, ర్యాంక్ 2 నుంచి 5 వరకు విద్యార్థులకు 75% శాతం, ర్యాంక్ 6 నుంచి 10 వరకు విద్యార్థులకు 50% శాతం మరియు ర్యాంక్ 11 నుంచి 20 వరకు విద్యార్థులకు 25% శాతం ఫీజు స్కాలర్షిప్ లు అందజేయనున్నట్లు ఆయన అన్నారు. మిట్స్ సెట్ రాసిన విద్యార్థులకు త్వరలోనే కౌన్సిలింగ్ జరుగుతుందని ఆయన అన్నారు. టాప్ లో నిలిచిన విద్యార్థులను యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సుల్లేర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల అభినందనలు తెలియజేసారు. ఫలితాల విడుదల కార్యక్రమం లో హేమంత్ కుమార్, రియాజ్ అలీ పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: