Sunday, 26 July 2026 12:23:32 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

సర్వ మతాలకు అతీతమైనదే త్రైత సిద్ధాంత గ్రంధం - డి.సురమౌళి

Date : 22 May 2026 09:27 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 22 : సర్వ మతాలకు అతీతమైనదే త్రైత సిద్ధాంత గ్రంథమని త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి జ్ఞాన వేదిక నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డి.సురమౌళి ప్రబోధించారు. శుక్రవారం త్రైత సిద్ధాంత సేవా సమితి ఆధ్వర్యంలో తంబళ్లపల్లె, పరస తోపు, ఎర్రసానిపల్లి, పంచాలమర్రి పంచాయతీలలోని గ్రామాలలో ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా సర్వ మతాల ప్రజలను ఉద్దేశించి సురమౌళి మాట్లాడుతూ ఇంటింటా ప్రధమ దైవ గ్రంథం భగవద్గీత, ద్వితీయ గ్రంధం బైబిల్, తృతీయ గ్రంథం ఖురాన్ అని తెలిపారు. ప్రతి మతంలో ఒకే సిద్ధాంతం ఇమిడి ఉందని అన్ని గ్రంథాలలో ధర్మం ఒకటేనని ఏసుక్రీస్తు ఒక గొప్ప యోగి అని భగవద్గీత లోని కర్మయోగ విధానాన్ని సువార్త వాక్యాలలో తెలియజేసినట్లు చెప్పారు. మత మార్పిడి వలన దైవ సంబంధ పాపం వస్తుందని కేవలం జ్ఞానంను పంచమని యేసు చెప్పాడు అని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఏ మతంలో ఉన్న వారైనా ఆ మతంలోనే ఉంటూ అన్ని గ్రంథాలు చదువుతూ మనుషులలో దైవత్వాన్ని ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. వేరువేరు కాలమాన పరిస్థితులను అనుసరించి దేవుడు మూడు మతాల వారికి మూడు గ్రంథాలను వేరువేరు దేశాలలో జ్ఞాన గ్రంధాలుగా అందజేసిన చెప్పారు. మత మార్పిడులు మానుకొని ఏ మతం వారైనా వారికి సంబంధించిన గ్రంథాలలో దైవత్వాన్ని గ్రహించి ఆత్మజ్ఞానాన్ని పెంపొందించాలని హితువు పలికారు. ఆయన వెంట త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి సభ్యులు కృష్ణ, వెంకటేష్, రాధ, లక్ష్మయ్య, విజయమ్మ, రమ, కావ్య శ్రీ, కృష్ణ, సుమలత, కీర్తి శ్రీ, అవినాష్, శ్రీదేవి, జ్ఞానేశ్వర్, శేఖర్, సునీత, నరసింహ ప్రసాద్ లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :