Sunday, 26 July 2026 01:13:15 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తన భూమిని కాజేయాలని దాయాదుల కుట్ర - తన భర్త,కుమారుడిని కోల్పోయానని బాధితురాలి ఆవేదన - అధికారులు చుట్టూ తిరుగుతున్న ఫలితం లేదని వెల్లడి - మద్దతు తెలిపి

Date : 23 November 2025 11:43 AM Views : 145

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తన భూమిని కాజేయాలని దాయాదుల కుట్ర - తన భర్త,కుమారుడిని కోల్పోయానని బాధితురాలి ఆవేదన - అధికారులు చుట్టూ తిరుగుతున్న ఫలితం లేదని వెల్లడి - మద్దతు తెలిపిన జనసేన నాయకులు రాయల్ గణి,చక్రి మదనపల్లె : తన భూమిని కాజేయాలని దాయాదులు కుట్రలు పన్నుతున్నారని ములకలచెరువు మండలం,దేవుళచెరువుకు చెందిన రెడ్డెం లక్ష్మిదేవి ఆరోపించారు.శనివారం ది మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ గోడును విన్నవించుకుంది.ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ తన భర్త రెడ్డెం రామిరెడ్డికి పూర్వీకుల నుండి సంక్రమించిన సర్వే నెంబర్ - 225లోని 1.21 ఎకరాలు భూమిపై దాయాదుల కన్నుపడిందని,ఇదే క్రమంలో తన భర్త రామిరెడ్డి,కుమారుడు మోహన్ రెడ్డిలను కోల్పోవడం జరిగిందని రోధించింది.అయితే తన భూమిని కాపాడుకోవడం కోసం అధికారులు,పోలీసులు చుట్టూ తిరిగిన న్యాయం జరగలేదని ఆరోపించారు.బాధితురాలికి ఉమ్మడి చిత్తూరు జిల్లాల జనసేన పార్టీ నాయకులు రాయల్ గణి నిలిచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో భూకబ్జాలు మితిమీరి పోయాయన్నారు.ఖాళీ స్థలం కనపదినా,ఖాళీ భూమి కనబడిన కబ్జా చేయడమే కబ్జాదారుల పని అన్నారు.రెడ్డెం లక్ష్మీదేవి తన సొంత భూమికి సంబంధించిన పత్రాలు కోసం కాళ్లరిగేలా తిరిగిన న్యాయం జరగకపోవడం దురదృష్టకరమన్నారు.అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఎన్ఎంవై 202511191025 ద్వారా అర్జీ సమర్పించింది.ఆమె సమస్యపై ములకలచెరువు సిఐని విచారణ జరపాలని ఆదేశించినప్పటికీ,ఎటువంటి స్పందన లేదన్నారు.సంవత్సరం క్రితం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైల్స్ దగ్ధమయ్యాయని,అందులో ఎంతోమంది పేదవారికి చెందిన భూముల పత్రాలు కాలిపోయాయన్నారు.దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజనుగా మదనపల్లి పేరు ప్రఖ్యాతి గడించిందని,అదే తరహాలో ఈ ప్రాంతంలో కబ్జాలు సైతం పెరిగిపోయాయన్నారు.పేదల భూములను,ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.ఒకరిద్దరిని అలా శిక్షిస్తే కబ్జాలకు చేసే వారికి భయం పుట్టుకొస్తుందన్నారు.ఇప్పటికైనా ఎవరూ లేని రెడ్డెం లక్ష్మీదేవి పరిస్థితిని అర్థం చేసుకుని కలెక్టర్,సబ్ కలెక్టర్,రెవెన్యూ అధికారులు,పోలీసు అధికారులు ఆమె భూమికి సంబంధించిన రికార్డులు అందజేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.బాధితురాలికి న్యాయం జరిగే వరకు జనసేన తరఫున పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చక్రి పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: