Sunday, 26 July 2026 09:53:04 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పోలీస్ స్టేషన్ లో బాధితులకు మర్యాదతో న్యాయం చేయాలి - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

తంబళ్లపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

Date : 20 March 2026 08:26 PM Views : 307

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 20 : తమ సమస్యలను చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు మర్యాదతో న్యాయం చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. శుక్రవారం ఆయన తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను, లాకప్ రూమ్, స్టేషన్ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై ఎస్సై టి అనిల్ కుమార్ తో సమీక్షించారు. గ్రామాలలో ఫ్యాక్షనిజం, రాజకీయ మతపరమైన సున్నితమైన అంశాలపై నిఘాపెంచాలన్నారు. నేరాల శాతం, రోడ్డు ప్రమాదాలు, జూదాలు, అసాంఘిక చర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. తీవ్రమైన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి త్వరితగతిన చార్జిషీట్ వేయాలన్నారు. మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చేసిన కొచ్చి ఫిర్యాదుదారులకు మర్యాదగా మాట్లాడి వారిలో భరోసా ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలు గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పరాదని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ కు ఫిర్యాదు చేయాలని గ్రామాల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం స్టేషన్ సిబ్బందిని వారి యోగక్షేమాలు అడిగి స్టేషన్ పరిశుభ్రంగా ఉంచుకొని పచ్చదనం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తో పాటు చేసిన సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :