నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 20 : తమ సమస్యలను చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు మర్యాదతో న్యాయం చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. శుక్రవారం ఆయన తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను, లాకప్ రూమ్, స్టేషన్ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై ఎస్సై టి అనిల్ కుమార్ తో సమీక్షించారు. గ్రామాలలో ఫ్యాక్షనిజం, రాజకీయ మతపరమైన సున్నితమైన అంశాలపై నిఘాపెంచాలన్నారు. నేరాల శాతం, రోడ్డు ప్రమాదాలు, జూదాలు, అసాంఘిక చర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. తీవ్రమైన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి త్వరితగతిన చార్జిషీట్ వేయాలన్నారు. మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చేసిన కొచ్చి ఫిర్యాదుదారులకు మర్యాదగా మాట్లాడి వారిలో భరోసా ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలు గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పరాదని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ కు ఫిర్యాదు చేయాలని గ్రామాల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం స్టేషన్ సిబ్బందిని వారి యోగక్షేమాలు అడిగి స్టేషన్ పరిశుభ్రంగా ఉంచుకొని పచ్చదనం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తో పాటు చేసిన సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News