నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 14 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కొండ కింద 25 కేవి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ(ఎస్.పి.డి.సి.ఎల్) డి.ఈ గంగాధరం తెలిపారు. శనివారం 25 కె.వి ట్రాన్స్ఫార్మర్ను ఎస్ ఈ సోమశేఖర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె మండలంలో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి డి.ఈ గంగాధరం తో పాటు విద్యుత్ అధికారులు,సిబ్బంది చూపిన చొరవ అభినందనీయమని ప్రశంసించారు. మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నిరంతర విద్యుత్తు ఏర్పాట్ల పై అందుబాటులో ఉండాలన్నారు.అనంతరం మల్లయ్య కొండ మహా శివుని దర్శించుకుని స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు విద్యుత్ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆయన వెంట ఏడి గోవిందరెడ్డి, ఏఈలు చంద్రమౌళి, సురేంద్ర, శేషు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర, నాగేంద్ర, ఇంతియాజ్, నాగేంద్రబాబు, ఆయాజ్, కాలేశా, శేషు, నవాజ్, రమేష్, సురేష్, రాజశేఖర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News