Sunday, 26 July 2026 03:50:37 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మిట్స్ లో అంబరాన్ని అంటిన అశ్వ్ 2కె26 కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్

అలరించిన సినీ గాయకులు సాగర్, లిప్సిక భాష్యం మరియు మౌనిక యాదవ్ తదితరలు

Date : 25 March 2026 08:41 PM Views : 205

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 25 : అంగళ్ళు సమీపం లో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అశ్వ్ 2కె26- జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ ను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ గాయకులు సాగర్, లిప్సిక భాష్యం మరియు మౌనిక యాదవ్ లు హాజరయ్యారు. కార్యక్రమం లో ఛాన్సల్లర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ ఇలాంటి వేడుకలు విద్యార్థుల జీవితంలో మరిచిపోలేని మంచి జ్ఞాపకాలను ఇస్తాయని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ముఖ్యంగా బాలికలు ముందుకు వచ్చి మదనపల్లి మరియు సమీప జిల్లాల్లో ఫ్లాష్‌మాబ్ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల యూనివర్సిటీకి మంచి పేరు వచ్చిందని అన్నారు. 2026లో చదువు పూర్తి చేసి వెళ్లే విద్యార్థులకు ఈ వేడుకలు మంచి జ్ఞాపకంగా నిలవాలని, మొదటి సంవత్సరం విద్యార్థులు సీనియర్ల నుంచి సంప్రదాయాలు, కార్యక్రమాల నిర్వహణ నేర్చుకోవాలని సూచించారు. మిట్స్ యూనివర్సిటీ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చురుకైన క్యాంపస్‌గా గుర్తింపు పొందిందని తెలిపారు. విద్యతో పాటు వినోదం, స్నేహాలు కూడా ముఖ్యమని, కలిసి పనిచేయడం మరియు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని అన్నారు సింగర్స్ పాడిన పాటలు విద్యార్థులను అలరించాయి. అశ్వ్ కార్యక్రమం సందర్బంగా “రకాసా” సినిమా ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. కార్యక్రమంలో కొణెదల నిహారిక, హీరో సంగీత శోభన్, హీరోయిన్ నయన్ సారిక, డైరెక్టర్ మానస శర్మ, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్, గెటప్ శీను చిత్ర బృందం ట్రైలర్‌ను ఆవిష్కరించి, సినిమా విశేషాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, “రకాసా” సినిమా యూత్‌కు ఆకట్టుకునే విధంగా యాక్షన్, ఎమోషన్ మరియు థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించబడిందని తెలిపారు. విద్యార్థులు కూడా ట్రైలర్‌ను ఆసక్తిగా వీక్షించి, హర్షధ్వానాలతో అభినందించారు. కార్యక్రమంలో ప్రో ఛాన్సల్లర్ నాదెళ్ల ద్వారకనాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్. సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, కన్వీనర్ డాక్టర్ కమల్ బాషా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక, డ్యాన్స్ మరియు ఇతర కార్యక్రమాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :