Sunday, 26 July 2026 01:13:16 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్

Date : 30 April 2026 04:29 PM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి లైసెన్స్ లేని మెడికల్ షాపులు వెంటనే సీజ్ చేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న మెడికల్ మాఫియా అక్రమాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మదనపల్లిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జక్కల వెంకటేష్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి టీ. కృష్ణప్ప, ఏరియా కార్యదర్శి పీ. మురళీ మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అవసరం లేకున్నా టెస్టులు చేయించి వేల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలో ఉన్న అన్ని మెడికల్ స్టోర్ల వివరాలు, లైసెన్సుల స్థితి, అనుమతి లేకుండా నడుస్తున్న దుకాణాలపై పూర్తి వివరాలతో జాబితా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే వైద్య సేవలు, పరీక్షలు, ఔషధాలపై ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను పట్టిక రూపంలో రూపొందించి ప్రతి ఆసుపత్రిలో ప్రదర్శించాలని కోరారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి దందాలకు పాల్పడుతున్న మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమతిలేని అబార్షన్ మాత్రల విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లైసెన్స్ లేని మెడికల్ స్టోర్లను తక్షణమే సీజ్ చేసి, అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ షాపులపై ప్రత్యేక దాడులు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా అందకపోవడం ఆందోళనకరమని తెలిపారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థో విభాగం ఉన్నప్పటికీ శస్త్రచికిత్సలు జరగకపోవడం, వైద్యులు ప్రైవేట్ క్లినిక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం దురదృష్టకరమని విమర్శించారు. ఆసుపత్రిలో ఈఎన్టీ వైద్యుడిని నియమించి, తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కె. మాధవ్, మునెప్ప, మునిరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :