నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్19 : కుదురుచీమనపల్లిలో బుధవారం సర్పంచ్ ఎం. శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన మండల డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్.ఏ. గఫూర్ ఆధ్వర్యంలో స్వామిత్వ గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఈ గ్రామసభ నందు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంటి యజమానులకు వారి ఇంటి ఖాళీ స్థలము మరియు ఇంటి నిర్మాణంతో కొలతలు తీసి 9(2) నోటీసులు పంపిణీ చేసి వాటిలో గల కొలతలు సరిచూసుకొని ఏవైనా అభ్యంతరములు ఉన్న యెడల గ్రామసభలో రాతపూర్వకంగా తెలియజేయాలని గ్రామ ప్రజలకు తెలియజేయడమైనదని, అభ్యంతరములను స్వీకరించడం జరిగిందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు రెడ్డి పంచాయతీ కార్యదర్శి యస్ మారప్ప, తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ రెడ్డి,అనిల్ కుమార్ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News