నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 06 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఎన్సీసీ ఎయిర్ వింగ్కు చెందిన క్యాడెట్ జి. రుద్ర తేజ భారత వైమానిక దళం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ అటాచ్మెంట్ క్యాంప్ (AFAC) ను విజయవంతంగా పూర్తి చేసి విశిష్ట ప్రతిభ కనబరిచాడని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ జాతీయ స్థాయి శిక్షణను హైదరాబాద్లోని డుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా క్యాడెట్ రుద్ర తేజకు భారత వైమానిక దళం కార్యకలాపాలు, యుద్ధ మరియు శిక్షణ విమానాల పరిచయం, విమానయాన సాంకేతిక అంశాలు, సైనిక క్రమశిక్షణ, నాయకత్వ వికాసం, జట్టు భావన, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై సమగ్ర శిక్షణ పొందారని అన్నారు. అలాగే భారత వైమానిక దళ అధికారులతో ప్రత్యక్షంగా మమేకమై వారి అనుభవాలను తెలుసుకునే అవకాశం పొందారని తెలిపారు. దేశ నలుమూలల నుండి 100 మందికిపైగా పాల్గొన్న ఈ శిక్షణలో మిట్స్ యూనివర్సిటీ క్యాడెట్ ప్రతిభ చూపడం గర్వకారణం అని అన్నారు.ఈ జాతీయ స్థాయి శిక్షణా శిబిరం ఎయిర్ ఫోర్స్ అటాచ్మెంట్ క్యాంప్ కమాండెంట్ వింగ్ కమాండర్ ఆర్యన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిందని ఆయన తెలిపారు. జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమంలో ప్రతిభ చూపిన క్యాడెట్ జి. రుద్ర తేజ ను మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్-ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్, ఎన్సీసీ ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు
Reporter
Namitha News