నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 25 : తంబళ్లపల్లె మండలంలోని ఎన్నుమలేటర్లు, సూపర్వైజర్లు ఎన్నికల జనగణన ప్రక్రియ 100% పూర్తి చేయాలని తాసిల్దారు శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో 97% పూర్తయిందని మిగిలిన మూడు శాతం వెంటనే పూర్తి చేయకపోతే చర్యలు తప్ప వన్నారు. ఎన్ని మలేటర్లు వలసలు, తాళాలు వేసిన ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సర్వేలో భాగంగా 34 ప్రశ్నావళి లో భాగంగా పిల్లల చదువు, టాయిలెట్, తాగునీటి క్లోరినేషన్, విద్యుత్ సర్వీసులు తో పాటు పాఠశాలల ఇంకా పలు రకాల సమాధానాలను క్రోడీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రమణ కుమార్, డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, ఏఈ వినోద్ కుమార్, ఆర్ ఐ ముద్దుకృష్ణ, సర్వేయర్ నాగరాజు, ఏపిఎం గంగాధర్, జనగణన సూపర్వైజర్లు, ఎన్నుమలేటర్లు పాల్గొన్నారు
Reporter
Namitha News