నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశాఖపట్నం - నవంబర్ 18 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వారు విశాఖపట్నంలో జరిగిన "విక్సిత్ భారత్ విజన్ సమ్మిట్-2025"లో డిఎక్స్ఎడ్జ్ (DX EDGE) సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. భారత ప్రభుత్వంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) మరియు నితి ఆయోగ్ వారు సంయుక్తంగా దేశ అభివృద్ధి లక్ష్యాలతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆద్వర్యం లో విశాఖపట్నం లో "విక్సిత్ భారత్ విజన్ సమ్మిట్-2025" ను నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబెర్ టి.జి. రవికుమార్ ఒప్పంద పత్రాన్ని అందుకున్నట్లు ఉపకులపతి తెలిపారు. అధునాతన సాంకేతిక నైపుణ్యాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ, పరిశోధన ఆవిష్కరణ అవకాశాలు, డిఎక్స్ ఎడ్జ్ సంస్థతో కలిసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు యూనివర్సిటీ లోని అధ్యాపకులకు మరియు విద్యార్థులకు అందించనున్నట్లు ఆయన అన్నారు. కార్యక్రమంలో డిఎక్స్ ఎడ్జ్ సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టి. శివ శంకర్ రెడ్డి చేతుల మీదుగా టి.జి రవి కుమార్ అందుకున్నారు.
Reporter
Namitha News