నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 20 :ః తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి లో వెలసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉదయం శేష వాహనం సాయంత్రం హంస వాహనంపై పురవీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆగమ శాస్త్ర ప్రకారం శాస్రోత్తకంగా స్వామివారికి టీటీడీ ప్రధాన అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వామి ల బృందం సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా మాడవీధుల్లో శేష వాహనం పై ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని హంస వాహనంపై మంగళ వాయిద్యాలు, హరినామ సంకీర్తనలతో మాడవీధులతోపాటు కోసువారిపల్లి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాదిగా భక్తజన సందోహం ఊరేగింపులో పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, గోవింద నామస్మరణ, చెక్కభజనలు, కోలాటాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది నగేష్, కృష్ణమూర్తి, మురళి భక్తులు పాల్గొన్నారు.
Reporter
Namitha News