నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 19 : సంక్రాతి పండుగ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా ప్రయాణికుల వద్ద నుండీ అధిక మొత్తం లో చార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రవేట్ ట్రావెల్స్ దోపిడీని నిలువరిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు. ఆదివారం రాత్రి మదనపల్లి ఆర్.టి.ఓ. అశోక్ ప్రతాప్ రావ్ ఆదేశాల మేరకు మదనపల్లి యం.వి.ఐ. దినేష్ చంద్ర తన సిబ్బంది తో మదనపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లే ప్రవేట్ ట్రావెల్స్ బస్ లను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 9 బస్ లకు ఒక్కొక్క బస్ కు పది వేల రూపాయలు ఫైన్ విధించారు, పది గూడ్స్ క్యారియర్ వాహనాల కు 70 వేల రూపాయలు ఫైన్ వేశారు. ఈ సందర్బంగా ప్రవేట్ ట్రావెల్స్ యాజమాన్యం కు ప్రయాణికుల వద్ద నుండీ అధిక చార్జీలు వసూలు చేసిన, ఎమర్జెన్సీ డోర్లు, రక్షణ పరికరాలు లేకపోతే ఉపేక్షించం చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించిన యం.వి.ఐ. దినేష్ చంద్ర
Admin
Namitha News