Sunday, 26 July 2026 12:24:03 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

పెంచుపాడులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణను సమీక్షించిన మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, నిసార్ అహ్మద్

Date : 10 July 2026 06:26 PM Views : 83

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెంచుపాడులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణను సమీక్షించిన మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, నిసార్ అహ్మద్ మదనపల్లి మండలం పెంచుపాడు గ్రామపంచాయతీ పరిధిలోని పాశంవారిపల్లెలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమీక్షించి, బూత్ లెవల్ ఏజెంట్లతో (బీఎల్‌ఏలు) మాట్లాడినట్లు తెలిపారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమర్థవంతంగా సేవలు అందించాలని కోరారు. గడువు ముగియడానికి నాలుగు రోజులు మాత్రమే ఉన్నందున డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ఎస్. నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి అంశాల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రత్యేక సవరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను స్వయంగా నింపి ప్రజలకు సహకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ వివిధ దరఖాస్తు ఫారాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు తొలగింపునకు సంబంధించి ఏదైనా నోటీసు అందితే వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి దండు శేఖర్ రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి కోటూరు ఈశ్వర్, నాయకులు మజ్జిగ కేశవ యాదవ్, కొత్తపల్లి నాగార్జున నాయుడు, బయ్యా రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, నల్లచెరువు బాషా, శంకరనాయక్, ఫయాజ్, ఆదినారాయణ, శంకర, శ్రీనివాసులు, సుధాకర, జయరాం తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: