నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నియోజకవర్గం వైసీపీ టౌన్ యూత్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ రెడ్డి బామ్మ కర్ణ మీనారెడ్డి ఇటీవల పరమపదించడంతో, పుంగనూరు నియోజకవర్గం దేశి దొడ్డి వనమాల దిన్నెలో నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమానికి మదనపల్లె పాత్రికేయులు హాజరై సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా పాత్రికేయులు హర్షవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కఠిన సమయంలో ధైర్యం చెప్పి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కర్ణ మీనారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె పాత్రికేయులు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ టీవీ 5 రమేష్, సివిఆర్ విజయ్ కుమార్, హెచ్ఎంటీవీ శ్రీనివాస్, సిటీ కేబుల్ గంగాధర్, ఎన్టీవీ ప్రసాద్, ఆర్ టి.వి రామకృష్ణ, ఆంధ్రప్రభ కిరణ్, ప్రజాశక్తి గోపాల్, బి. ఆర్.కే. న్యూస్ కోటికి శ్రీనివాసులు, విశాలాంధ్ర ముని, ఐ న్యూస్ శ్రీనివాసులు, కేశవరెడ్డి, అంబులెన్స్ రవి, మోనిష్, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News