నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 06 : మారుమూల ప్రాంతాలతో పాటు ప్రతి ఒక్కరూ మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని ఆలోచింపజేసేలా అవగాహన పెంచి విజయవంతం చేయాలని కడప, అన్నమయ్య జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ మండలి (దిశ) క్లస్టర్ మేనేజర్ వేంపల్లి భాస్కర్ సూచించారు. బుధవారం ఆయన తంబళ్లపల్లె సిహెచ్సిలోని ఐ సి టి సి కేంద్రంతోపాటు ఎల్ఏసి ల్యాబ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి సంతృప్తి చెంది హై రిస్క్ ఏరియాలను గుర్తించి హెచ్ఐవి పరీక్షలు చేయించడంతోపాటు హెచ్ఐవి తో జరిగే నష్టాలను వారికి వివరించి అవగాహన పెంచాలన్నారు. హెచ్ఐవి వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి పాజిటివ్ వచ్చిన వారిని ఏఆర్టీకి పంపి ఉచితంగా మందులు పంపిణీకి సహకరించాలన్నారు. ఆయన వెంట ఐసీటీసీ కౌన్సిలర్ చంద్రమోహన్, ఎల్ టి బాలాజీ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News