నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 26 : భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత బలోపేతం మరియు ప్రజాసేవను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో వివిధ మండలాలు, అనుబంధ విభాగాలు మరియు యూత్ విభాగాలకు కమిటీలను అధికారికంగా నియమించడం జరిగింది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులందరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేయాలని పార్టీ నాయకత్వం ఆకాంక్షించింది. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులందరికీ భారత చైతన్య యువజన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు
Reporter
Namitha News