నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 15 : బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఓట్ చోరీ దాగుందని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఎపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ కె బాషా అన్నారు. శనివారం తన కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ దేశం లో వివిధ రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తుండటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఓట్ చోరీ పై విసృతంగా ప్రచారం నిర్వహించడం తో పాటు, సాక్ష్యలతో అదారాలు బయట పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే పోలింగ్ ముగిసే చివరి సమయం లో ఓటు శాతం విజయావకాశాల పై తీవ్రంగా ప్రభావితం చేయడం పరిగణలోకి తీసుకోవాలన్నారు. జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో ఇదే తరహాలో ఫలితాలు రావడం పైన ప్రజల్లో అనుమానాలు బల పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమీషనర్ పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం కోసం బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని కోరారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ రాజిలేని పోరాటం కోన సాగిస్తుందన్నారు. తెలంగాణా లో కాంగ్రెస్ పార్టీ విజయం పై రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, ముఖ్య మంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు. ఎపి లోను 2029 జరిగే ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ ని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడానికి ఇప్పటి నుండి ప్రత్యేక కార్యాచరణ తో పార్టీ శ్రేణులను సమయాత్తం చేస్తామన్నారు .
Reporter
Namitha News