నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 17 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలోని దిగువపేటలోని శ్రీ పార్వతి సమేత చంద్ర శేఖర స్వామిఆలయంలో సోమవారం కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా లక్ష కార్తీక దీపోత్సవం ను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ ప్రధాన అర్చకులు బాలాస్వామి ఉదయం ఆలయాన్ని శుద్ధి చేసి స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించి పలు రకాల పుష్పాలతో స్వామిని అలంకరణ చేసి భక్తులకు దర్శన బాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు తాంబూలం, ప్రసాదం వాయినంగా అర్చకులు బాలాస్వామి అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.చంద్రశేఖర స్వామి ఆలయంలో కీర్తి శేషులు పుష్ప జ్ఞాపకార్థం రెడ్డిశేఖర్ కుమార్తె శాన్వి రెడ్డి వారి సౌజన్యం తో భక్తులకు అన్నదానం నిర్వహించారు.ఆలయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై రమేష్ బాబు పోలీస్ బందో బస్త్ నిర్వహించారు.
Reporter
Namitha News