Sunday, 26 July 2026 04:40:54 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మైనర్ కుమార్తె కోసం వారం రోజులు గా పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న తల్లి పావని

కూతురు ఆచూకీ తెలియక తల్లడిల్లుతున్న తల్లి పావని

Date : 20 December 2025 11:07 PM Views : 354

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 20 : అన్నమయ్య జిల్లా వాయల్పాడు లోని జెట్టి పాళ్యంవీధి లో టైలరింగ్ చేసుకొంటూ తన ముగ్గురి బిడ్డలను చందివించు కొంటూ జీవనం చేసుకొంటున్న విధవరాలైన తల్లి పావని. పెనుమూరు మండలం అడవిపల్లి ఎస్టీ కాలనీ లో నున్న నాన్నమ్మ ను చూడటానికి 13వ తేదీ శనివారం తమ్ముడు ప్రణీత్ ను వెంటబెట్టుకొని వెళ్లిన మహేశ్వరీ. సోమవారం 15వ తేది ఉదయం ఇద్దరం స్కూల్ కు వెళ్లాలని అడివి పల్లి నుండీ తమ్ముడు ప్రణీత్ తో కలిసి బయలుదేరిన మహేశ్వరీ. చిత్తూరు బస్టాండ్ కు చేరుకొని తమ్ముడు ని పీలేరు బస్ ఎక్కించి, తాను వేరే బస్ లో కాలేజీ కి వెళ్ళిపోతాను, నువ్వు ఇంటికెళ్లు అని పంపిన మహేశ్వరి. కుమార్తె కోసం సాయంత్రం 7గంటల వరకూ ఎదురుచూసి ఎంతకీ రాకపోయేసరికి కళాశాల కు ఫోన్ లో సంప్రదించిన తల్లి కి మహేశ్వరీ ఈ రోజు కళాశాల కే రాలేదని తెలిపిన కళాశాల సిబ్బంది. హతశురాలైన తల్లి సోమవారం రాత్రి వాయల్పాడు పోలీసులకు తెలిపితే పెనుమూరు వెళ్ళమన్నారు. మంగళవారం ఉదయం పెనుమూరు పోలీస్ స్టేషన్ కు వెళితే సాయంత్రం సమయం లో చిత్తూరు పోలీస్ స్టేషన్ కు పంపగా వెంటనే స్పందించిన పోలీసులు బుధవారం ఉదయం చిత్తూరు బస్ స్టాండ్ లో విచారణ చేస్తే సిసి ఫుటేజ్ ఆధారంగా బాలిక మదనపల్లి బస్ ఎక్కినట్లుగా గుర్తించి మదనపల్లి కి పోలీసులను సంప్రదించాలని తెలుపడం తో మదనపల్లి 2వ పట్టణం పోలీసులును సంప్రదిస్తే బస్ స్టాండ్ లోని ఓ హోటల్ లో మగ వ్యక్తి తో కలిసి భోజనం చేసినట్లుగా సిసి ఫుటేజ్ లో గుర్తించి, సదరు మగ వ్యక్తి గురించి ఆరా తీయగా ఆర్.టి.సి హైర్ బస్ డ్రైవర్ మంజునాథ్ గా గుర్తించి, చిత్తూరు 1పియస్ లో ఫిర్యాదు చేయాలని మళ్ళీ చిత్తూరు కు పంపేసారని, మళ్ళీ చిత్తూరు కు వెళితే 18వ తేది రాత్రి జీరో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసిన చిత్తూరు 1 టౌన్ పోలీసులు, ఈ ఎఫ్.ఐ.ఆర్. తో మదనపల్లి కి వెళ్ళండి అని పంపేశారు. తీరా ఇక్కడికి వస్తే FIR మాకు రాలేదు, మళ్ళీ రా అని తిప్పించుకొంటున్నారని, అడిగితే ఎప్పుడు ఎఫ్.ఐ.ఆర్. వస్తే అప్పుడు దర్యాప్తు చేస్తామని తెలపడం, నాకు ఇచ్చిన జిరాక్స్ ఎఫ్.ఐ.ఆర్. ఇస్తే అక్కడి నుండీ రావాలని బతిమాలినా స్పందన లేదని, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం కానీ న్యాయం జరుగలేదని వాపోతున్న తల్లి పావని. పావని ఇద్దరు బిడ్డలు, పావని తల్లి బస్ స్టాండ్ వద్ద పడిగాపులు కాస్తూ పోలీస్ స్టేషన్ కు, బస్ స్టాండ్ కు తిరుగుతూ బిడ్డ కోసం అల్లాడుతున్న తల్లి పావని వారం గడుస్తున్నా మైనర్ బాలిక, ఉందా, చంపేసారా, అమ్మేసారా, లేక ఎవడితో నైనా వెళ్లిందా, అసలు బ్రతికే ఉందా అంటూ వేడుకొంటూ, పోలీసులు ఎప్పుడు పిలుస్తారో, నా బిడ్డ ఆచూకీ చెపుతారో అని పోలీసుల పిలుపు కోసం బిడ్డలతో కలిసి బస్ స్టాండ్ లోనే వేచి ఉన్న తల్లి పావని

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :