నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 20 : ఖరీఫ్ సీజన్లో గ్రామ వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి అంతస్తు వ్యవసాయ సూచనలు ఇవ్వడానికి అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి శివ నారాయణ సూచించారు. బుధవారం తంబళ్లపల్లె ఆర్బికే లో ఏఈఓ లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయం పై ఆసక్తి పెంచాలన్నారు. వ్యవసాయ భూముల దుక్కి నుండి వేరుశనగ విత్తన కాయలు పంపిణీ వరకు సచివాలయ స్థాయిలో రైతులకు వ్యవసాయం పైక్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఏపీ ఎఫ్ ఆర్ 11 అంకెలు నమోదు, ఏపీఎంసీ యాప్ ద్వారా వ్యవసాయ సలహాలు సూచనలు అందివ్వాలని తెలిపారు. రైతులకు వ్యవసాయ పరికరాలు ఎస్సీ ఎస్టీ, సన్న కారు రైతులకు 50% సబ్సిడీ, జనరల్ రైతులకు 40 శాతం సబ్సిడీతో అందివ్వడానికి గడువు మరో అయిదు రోజులు పెంచిన విషయాన్ని రైతుల దృష్టికి తీసుకెళ్లి సహకరించాలన్నారు. ఏపీ ఎఫ్ ఆర్ సరాసరి 3000 మంది రిజిస్ట్రేషన్ చేయించాలని ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ముందస్తు వ్యవసాయ సూచనలు, సలహాలు పాటించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆయన వెంట ఏవో రమణకుమార్, ఏఈఓ సురేష్, మండలంలో గ్రామ వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News