నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 11 ః తంబళ్లపల్లె మండలం లో ప్రబలుతున్న ముద్దచర్మ (బొబ్బలు) వ్యాధి పై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని తంబళ్లపల్లె మండలం పశువైద్యాధికారి డాక్టర్ విక్రమ్ రెడ్డి హెచ్చరించారు. గురువారం పశువుల బొబ్బల వ్యాధిపై పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు ఆయన స్పందించి మండలంలోని కొటాల, ఆర్ ఎన్ తాండ, గోపి దీన్ని తోపాటు పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేశారు. పశువులకు సోకిన ముద్ద చర్మ వ్యాధికి చికిత్సలు చేసి ఇది అంటువ్యాధిని వ్యాధి సోకిన పశువును దూరంగా ఉంచాలని సూచించారు. వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా పశువు ఈ వ్యాధితో శరీరం బొబ్బలు వచ్చి నీరస పడతాయని సకాలంలో చికిత్సలు పొందితే నయమవుతాయని సూచించారు. స్థానిక పశువైద్య సిబ్బంది తమ పరిధిలో ముద్ద చర్మ వ్యాధిపై అప్రమత్తంగా ఉండి పాడి పశువులకు సకాలంలో చికిత్సలు అందించాలని సూచించారు. అతని వెంట పశువైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News