Sunday, 26 July 2026 10:01:02 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లె చింతపండు కు జీఐ (GI) ట్యాగ్ దరఖాస్తుకు మిట్స్ యూనివర్సిటీ మద్దతు

మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ సహకారం తో దరఖాస్తు చేసిన శ్రీ సాయి టామరిండ్ సొసైటీ

Date : 17 January 2026 09:11 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -జనవరి 17 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ వారు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో చింతపండు లభ్యత ప్రతీ సంవత్సరం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో చింతపండు కు భౌగోళిక సూచిక జియో ట్యాగ్ కోసం అధికారికంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ సాయి టామరిండ్ సొసైటీ వారి తరపున ఈ జీఐ దరఖాస్తును చెన్నైలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ, ఐపీఆర్ కార్యాలయానికి దరఖాస్తు సమర్పించబడిందని వైస్-ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. యూనివర్సిటీ లోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మద్దతుతో మదనపల్లె పరిసర ప్రాంత చింతపండు కు భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించబడిందని ఆయన అన్నారు. మిట్స్ యూనివర్సిటీలోని పరిశోధనా విభాగం మరియు మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ సహకారంతో మదనపల్లె ప్రాంతంలో చింతపండు సాగు, ఉత్పత్తి మరియు మార్కెట్ లభ్యతపై అధ్యయనం నిర్వహించామని ఆయన చెప్పారు. ఇక్కడి చింతపండు గాఢమైన పులుపు, మంచి గుజ్జు శాతం, సహజ రంగు, దీర్ఘకాలం నిల్వ ఉండే లక్షణాలు కలిగి ఉందని తెలిపారు. ఈ ప్రత్యేక లక్షణాలు మదనపల్లె ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, వాతావరణం మరియు నేల స్వభావంతో ముడిపడి ఉన్నాయని వివరించారు. మదనపల్లె మరియు పరిసర మండలాల్లోని చింతపండు సాగుదారులు, ఉత్పత్తిదారుల సంఘాలు కలిసి స్థానిక మార్కెట్లు మాత్రమే కాకుండా ఇతర జిల్లాలు మరియు రాష్ట్రాలకు కూడా చింతపండు సరఫరా చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రాంతం నుంచి వచ్చే చింతపండు దేశీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ను పొందుతోందని చెప్పారు. ఈ అధ్యయనం ద్వారా చింతపండు సాగుదారులకు సరైన మార్కెట్ సమాచారం అందించడంతో పాటు, మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా మంచి ధర లభించే విధానాలు రూపొందించేందుకు అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. అలాగే భవిష్యత్తులో మదనపల్లె చింతపండుకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టవచ్చని సూచించారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన శ్రీ సాయి ట్యామరిండ్ సొసైటీ, మదనపల్లె , మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు మిట్స్ ఆర్ & డి సెల్ బృందాలను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, అడ్వైజర్ (ఆర్ & డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ (ఆర్&డి) డా. పి. శివయ్య, ఉత్పత్తిదారుల కంపెనీ అధ్యక్షులు వెంకట రెడ్డి లు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :