నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - మే 16 : తంబళ్లపల్లి మండలంలోని కోసువారిపల్లికు చెందిన వైకాపా యువ నేత కిషోర్ కుమార్ రెడ్డి గత దశాబ్ద కాలంగా నిస్వార్ధంగా పార్టీ కోసం పనిచేస్తూ పెద్దిరెడ్డి కుటుంబానికి నమ్మిన బంటుగా నిలిచి నేడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి అతడే ఒక సైన్యం లా నిలిచాడు. శుక్రవారం తాడేపల్లి వైకాపా ప్రధాన కార్యాలయం నుండి కిషోర్ కుమార్ రెడ్డికి వైకాపా రాష్ట్ర యువత జాయింట్ సెక్రెటరీగా నియామక ఉత్తర్వులు అందాయి. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం పెద్దిరెడ్డి కుటుంబం గెలుపు కోసం అహర్నిశలు చేసిన కృషికి కిషోర్ కుమార్ రెడ్డిని ఈ పదవి వరించినట్లు వైకాపా నాయకులు తెలిపారు. ఆయన ఎంపికపై నియోజకవర్గంలోని వైకాపా నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తన ఎంపికకు సహకరించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని భవిష్యత్తులో వైకాపా బలోపేతం తో పాటు పెద్దిరెడ్డి కుటుంబానికి అంకితమవుతానని కిషోర్ కుమార్ రెడ్డి భావోద్వేగంతో చెప్పారు. వైకాపా నాయకులు, కార్యకర్తల సంక్షేమం కోసం ఎమ్మెల్యే ద్వారకన్న సహకారంతో అహర్నిశలు కృషి చేస్తానని ధీమాగా హామీ ఇచ్చారు
Reporter
Namitha News