నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 16 :: ములకలచెరువు కల్తీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న ఏ 32 మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు ఏ 33 జోగి రాము, ఏ 29 అల్లాబక్షు, ఏ 19 ఆన్సర్రాసు, ఏ 16 కిరీకంటి రవి, ఏ 14 బాలరాజు, ఏ6 మని మారన్, ఏ 5 రాజేష్,మొత్తం ఎనిమిది మంది నిందితులు సోమవారం తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టు లో విచారణ నిమిత్తం హాజరయ్యారు. అనంతరం కేసు వాయిదా పడడంతో జోగి సోదరులు మల్లయ్య కొండకు బయలుదేరారు. జోగి సోదరులను కలవడానికి తంబళ్లపల్లెకు చెందిన వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు హాజరయ్యారు. జోగి సోదరులు కూడా హాజరవుతున్న సందర్భంగా మొలకలచెరువు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు నుండి బయటకు వచ్చిన జోగి సోదరులకు వైకాపా నాయకులు పెద్ద ఎత్తున హర్షద్వానాలు ప్రకటించారు
Reporter
Namitha News