నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 08 : తంబళ్లపల్లి మండలంలోని రెడ్డి కోట పంచాయతీ వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కొప్పల శంకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల పార్టీ అధ్యక్షుడు రేపన చౌడేశ్వర తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన రచ్చబండ పార్టీ ఎన్నికల కమిటీ ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు శంకర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీకి విధేయుడుగా ఉంటూ పంచాయతీలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైకాపా నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు
Reporter
Namitha News