నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 23 : మదనపల్లె సమీపంలో అంగళ్ళు వద్ద మిట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ & సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగము లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కార్తీక్.బి కు తమిళనాడు రాష్ట్రం, పాండిచేరి యూనివర్సిటీ లోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగము నుంచి పీహెచ్డీ పట్టా లభించింది అని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. "సూర్యకాంతి పూర్తిగా అందని పరిస్థితుల్లో కూడా సౌర ప్యానెల్ల నుండి ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి పొందేందుకు ఉపయోగించే వివిధ అమరిక పద్ధతులపై పరిశోధన" (Different Solar PV Array Reconfiguration Topologies to Maximize Power Extraction under Different Partial Shading Conditions) అనే అంశంపై పాండిచేరి యూనివర్సిటీ, ఎలక్ట్రికల్ విభాగం నందు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఎమ్.సుధాకరన్ పర్యవేక్షణలో చేసిన పరిశోధనను గాను డాక్టరేట్ ను అందించినట్లు ఆయన అన్నారు. డాక్టరేట్ పొందిన కార్తీక్.బి ను మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ మనవాళన్ గుణశేఖరన్ మరియు తదితరులు అభినందనలు తెలియజేసారు
Reporter
Namitha News