నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 3 : భవిష్యత్తు కోసం విద్యార్థులు భూసార పరీక్షలపై అవగాహన పొంది తద్వారా కుటుంబ పెద్దలకు సూచనలు ఇవ్వాలని వ్యవసాయ అధికారి రమణ కుమార్ సూచించారు. శనివారం మోడల్ స్కూల్ లో విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోసార పరీక్షల నిర్వహణపై రాయచోటి భూసార పరీక్షల వ్యవసాయాధికారిణి సుధారాణి విద్యార్థులకు భూసార పరీక్షలు నిర్వహణ, మట్టి నమూనా సేకరించే పద్ధతి పై అవగాహన కల్పించారు .రసాయన ఎరువుల వాడకం ద్వారా భూసారం తగ్గి భూమి భూసారం కోల్పోతుందన్నారు. మట్టి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని సేంద్రియ ఎరువులతో భూసారం పెంచుకొని అధిక దిగుబడులతోపాటు భూసారం కాపాడుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, బయాలజీ టీచర్స్ అజాజ్ అహ్మద్, సాదిక్ అలీ ఖాన్, వైష్ణవి, రైతు సేవ కేంద్రం సిబ్బంది పి సురేష్, రెడ్డి శేఖర్, సుధాకర్ మరియు ఐసిఓపి సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News