నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వికలాంగులకు కృత్రిమ అవయవాల పంపిణి - ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ భాష - వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు మౌలాలి మదనపల్లె పట్టణం స్థానిక చిత్తూరు బస్టాండ్ సర్కిల్ నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఒమేగా రెహబ్ ఫెడరేషన్ బెంగళూరు వారి సహకారం తో మదనపల్లె ఫిజికల్ హ్యాండీ క్యాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విక లాంగుల కోసం ఉచిత సహాయ పరికరాల పంపిణి కార్యక్రమం నిర్వ హించారు. వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు మౌలాలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమానికి ముఖ్య అతిదిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు. ఇందులో లబ్ధి దారులకు అవసర మైన కృత్రిమ కాలు, కృత్రిమ చెయ్యి, చెవిటి మిషన్, వీల్ చైర్స్, చంక కర్రలు, మొదలైనవి పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ సమాజం లో వైకల్యం తో ఇబ్బంది పడు తున్న వికలాంగుల సహాయార్థం ఒమేగా రెహబ్ ఫెడరేషన్ బెంగళూరు వారు ముందుకొచ్చి వారికి అవసరమైన సహాయ పరికరాల వివరాలను కొలతలను తీసుకొని ఉచితంగా అంద జేయడంపట్ల అభి నందనలు తెలిపారు. ఇలాంటి కార్య క్రమాలు సమాజంలో ప్రతి ఒక్కరు గౌర వంగా జీవించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.ఈకార్య క్రమాన్ని ఏర్పాటు చేసిన వికలాంగుల సంఘాన్ని అభి నందించారు. వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు మౌలాలి మాట్లాడు తూ దివ్యాంగులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వారి సమస్యలకు పరిష్కారం చూపడం కోసమే ఈ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలి పారు.నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ వికలాంగుల సహాయ పరికరాలను గుర్తించి వారికి సహాయ పరికరాలు అంద జేయడం అభినంద నీయమన్నారు. ఈ క్యాంపు ద్వారా సుమారు 53 మందికి దివ్యాంగులకు అవ సరమైన పరికరాలను అందజేయడం జరి గిందన్నారు. టిడిపి దివ్యాంగుల విభాగం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, టమోటా మార్కెట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ డా. ఎస్. దినేష్ కుమార్ ఆధ్వర్యంలో 53 మంది వికలాంగు లను గుర్థించి, కృతిమ అవయ వాలు, సహాయ పరికరాలు అందజే యడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టిడిపి దివ్యాంగుల విభాగం నియోజకవర్గ అధ్యక్షులు వెంకట రమణ నాయుడు మాట్లాడుతూ దివ్యాంగులు గౌరవంగా జీవించ డానికి ఒమేగా రెహబ్ ఫెడరేషన్ బెంగళూరు వారు ముందుకు వచ్చి సహయ సహకారా లు అందించడం గొప్ప విషయమని తెలిపారు. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ కవిత రాణి మాట్లాడుతూ తమ సంస్థలో కొనసాగుతున్న ఆనంద వృద్ధాశ్రమం లో వయోవృద్ధులకు అవసరమైన సహాయ పరికరాలను అంద జేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఒమేగా రెహబ్ ఫెడరేషన్ బెంగళూరు డా.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో 53 మందికి అవసరమైన సహాయ పరికరాలను అంద జేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం అధ్యక్షులు మౌలాలి, వైఎస్ఆర్సిపి మాజీ కౌన్సిలర్ పాల్ చంద్రశేఖర్, చైతన్య సర్వీస్ సొసైటీ అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జివీఎస్ బాబు, జగదీష్, వెంకట రమణ నాయుడు , ఈశ్వరి డాక్టర్ సురేష్ ట్రైనర్లు రేఖ,సవరణ, శరణ్య, వికలాంగులు పాల్గొన్నారు.
Reporter
Namitha News