నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 18 : తంబళ్లపల్లె మండల కేంద్రానికి సమీపంలోని శ్రీనివాస కాలనీ లో ఓ ఇంటిలో జరుగుతున్న జూదం పై ఎస్సై టి అనిల్ కుమార్ తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మంది జూదరులను అదుపులోకి తీసుకొని వారి నుండి రూ 46,170 సొమ్ముతోపాటు మూడు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు విలేకరులకు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలపై ఉపేక్షించేది లేదని ఎక్కడైనా జూదం, కోడి పందాలు, నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సై తెలిపారు.
Reporter
Namitha News