నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - జనవరి 20 :ః తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి పంచాయతీలో ల్యాండ్ డెవలప్మెంట్ తో వ్యవసాయానికి అనువుగా మార్చుకొని అందులో ప్రకృతి వ్యవసాయ పంటలు పండిస్తున్న రైతులు జిల్లాకే ఆదర్శంగా నిలిచినట్లు పోర్డు డైరెక్టర్ లలితమ్మ కొనియాడారు. మంగళవారం ఆమె గుండ్లపల్లి పంచాయతీలో ల్యాండ్ డెవలప్మెంట్లో అభివృద్ధి చేసిన పొలాలలో ప్రకృతి వ్యవసాయంతో పండించిన వేరుశనగ, ఉలవ, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. సేంద్రియ కషాయాలతో పండ్లతోటలైన మామిడి, టమోటా, కూరగాయల పంటలు పండించడం పై వారిని అభినందించారు. రైతులు మాట్లాడుతూ ఫోర్డ్ సంస్థ సహకారంతో ల్యాండ్ డెవలప్మెంట్లో మా భూములు చదునుతో పాటు పొలాలకు రోడ్లు చేసుకుని అందులో ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు నాణ్యమైన దిగుబడి, ప్రకృతి కషాయాలతో టమోటా,మామిడి పంటలు ఎలాంటి రోగాలు లేని పూత పూసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రకృతి పంటలైన సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు సాగు చేస్తామన్నారు.ప్రొద్దుటూరు, చెన్నే కొత్తపల్లి లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పొంది వారికి దీటుగా ప్రకృతి వ్యవసాయమే లక్ష్యంగా పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించి భవిష్యత్తులో మానవాళికి ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకృతి వ్యవసాయం అవలంబించాలని లలితమ్మ కోరారు. ఆమె వెంట సిబ్బంది రమణ, రైతులు వేట మల్లికార్జున, నరసింహప్ప నాయుడు, లక్ష్మయ్య సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News