నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 25 : క్రిస్మస్ పండుగ సందర్భంగా మదనపల్లి పట్టణం లోని హెచ్.పీ గ్యాస్ దగ్గర జెసిఎం ఇమ్మానుయేల్ చర్చ్ వారి ఆహ్వానం మేరకు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని కేకు కట్ చేసి క్రైస్తవ సోదరీ, సోదరులతో క్రిస్మస్ పండుగ ను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ సందర్బంగా క్రిస్టియన్ సోదరీ, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు, యువనాయకులు జునైద్ అక్బరి , శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గంగారపు నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News