Monday, 27 July 2026 04:18:05 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు నిరుపేదలకు శ్రీరామరక్ష

Date : 30 December 2025 09:53 PM Views : 210

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 30 : కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా భీమా పొందిన లబ్ధిదారులకు భవిష్యత్తులో ఆ కుటుంబాలకు శ్రీరామరక్షగా నిలుస్తుందని విడ్స్, సీఎఫ్ఎల్ ప్రతినిధులు హరికృష్ణ, టి శ్రీనివాస ప్రసాద్, కె శోభన్ ప్రధీప్ లు సూచించారు. మంగళవారం తంబళ్లపల్లె మండలం గంగిరెడ్డిపల్లి కు చెందిన ఎం అశోక్ నాయుడు ఈ మధ్యకాలంలో ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు ఆర్.బి.ఐ సౌజన్యంతో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా రూ4 లక్షలు ఆయన తండ్రి ఆంజనేయులకు చౌడ సముద్రం గ్రామీణ బ్యాంకు మేనేజర్ దినేష్ పెరుమాళ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బ్యాంకుల్లో అకౌంట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తంబళ్లపల్లె, పెద్దమండెం, కురబలకోట మండలాలలో విడ్స్(వాలంటరీ ఇంటిగ్రేటెడ్ సొసైటీ) మరియు సి ఎఫ్ ఎల్(ఆర్థిక అక్షరాస్యత కేంద్రం) లు బ్యాంకు వినియోగదారుల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లు చేయించడం, భీమా పథకాలపై అవగాహన, సైబర్ నేరాలు, లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ నష్టాలపై యువతకు సూచనలు, సలహాలు చేసి వారిలో చైతన్యం తేవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :