నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 30 : కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా భీమా పొందిన లబ్ధిదారులకు భవిష్యత్తులో ఆ కుటుంబాలకు శ్రీరామరక్షగా నిలుస్తుందని విడ్స్, సీఎఫ్ఎల్ ప్రతినిధులు హరికృష్ణ, టి శ్రీనివాస ప్రసాద్, కె శోభన్ ప్రధీప్ లు సూచించారు. మంగళవారం తంబళ్లపల్లె మండలం గంగిరెడ్డిపల్లి కు చెందిన ఎం అశోక్ నాయుడు ఈ మధ్యకాలంలో ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు ఆర్.బి.ఐ సౌజన్యంతో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా రూ4 లక్షలు ఆయన తండ్రి ఆంజనేయులకు చౌడ సముద్రం గ్రామీణ బ్యాంకు మేనేజర్ దినేష్ పెరుమాళ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బ్యాంకుల్లో అకౌంట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తంబళ్లపల్లె, పెద్దమండెం, కురబలకోట మండలాలలో విడ్స్(వాలంటరీ ఇంటిగ్రేటెడ్ సొసైటీ) మరియు సి ఎఫ్ ఎల్(ఆర్థిక అక్షరాస్యత కేంద్రం) లు బ్యాంకు వినియోగదారుల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లు చేయించడం, భీమా పథకాలపై అవగాహన, సైబర్ నేరాలు, లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ నష్టాలపై యువతకు సూచనలు, సలహాలు చేసి వారిలో చైతన్యం తేవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Reporter
Namitha News