Sunday, 26 July 2026 04:42:10 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ఇండియా మ్యాగ్జైన్ లో ప్రచురితమైన మిట్స్ విద్యార్థిని మీనాక్షి పరిశోధన

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ బేసెడ్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ లోని పరిశోధన ను హైలైట్ గా ప్రచురితం

Date : 25 November 2025 07:53 PM Views : 210

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 25 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు బి.టెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మీనాక్షి ఎలక్ట్రిక్ వాహనాల "ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ బేసెడ్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ " అనే అంశంపై చేసిన పరిశోధనకు ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రికల్ ఇండియా మ్యాగజిన్ లో ప్రచురించబడినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ సందర్బంగా విభాగాధిపతి డాక్టర్ ఎ.వి పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, విభిన్న బ్యాటరీ సెల్స్‌తో కూడిన బ్యాటరీ ప్యాక్లను సమర్థవంతంగా నిర్వహించడం అత్యంత కీలకం అని, వాడిన లేదా ఎక్కువ రోజులు అయిన తేడా గల సెల్స్‌ను ఒకే బ్యాటరీ ప్యాక్‌లో కలపడం వల్ల బ్యాటరీ పనితీరు తగ్గిపోవడం, విద్యుత్ వినియోగ సామర్థ్యం తగ్గడం, భద్రతా సమస్యలు ఉత్పత్తి కావడం వంటి ప్రమాదాలు ఉన్నాయని పరిశోధనలో పేర్కొన్నారు. ఇలాంటి మిశ్రమ సెల్స్ వోల్టేజ్ మరియు వేడి పంపిణీలో అసమతుల్యతను కలిగించడమే కాక, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) ను నియంత్రించడం క్లిష్టమవుతుందని అన్నారు. ఈ పరిశోధనలో బ్యాటరీ యొక్క స్టేట్ ఆఫ్ హెల్త్ ను అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత మోడల్‌ను ప్రతిపాదించడం ద్వారా బ్యాటరీ వోల్టేజ్, కరెంట్, ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ భద్రత, వారంటీ, వాడిన బ్యాటరీల రీయూజ్ వంటి అంశాలపై విలువైన సమాచారాన్ని అందించినట్లు తెలిపారు. ఈ పరిశోధన ఎలక్ట్రిక్ వాహనాల టెక్నాలజీ మరియు బ్యాటరీ మేనేజ్‌మెంట్ రంగాలలో కొత్త అధ్యయనానికి దారితీయగలదని పేర్కొన్నారు. అదనంగా, ఈ మోడల్‌ను లిథియం ఐరన్ ఫాస్ఫేట్ మరియు నికెల్-మాంగనీస్-కోబాల్ట్ వంటి వివిధ రసాయన కణాల మీద అమలు చేయడం ద్వారా సంక్లిష్ట పరిశోధనా నమూనాలు మరియు వాస్తవ ఇంజినీరింగ్ పరిష్కారాల మధ్య దూరాన్ని తగ్గించి, ఎక్కువ కాలం నిలిచే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు మార్గం సుగమం చేస్తుందని వివరించారు. ఈ పరిశోధనకు సహాయసహకారాలు అందించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ మరియు విద్యార్థిని మీనాక్షిలను యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :