నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 26 : మదనపల్లి బీజేపీ నేత ఎల్లంపల్లి ఇంట విషాదం. అన్నమయ్య జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి యల్లంపల్లి ప్రశాంత్ తండ్రి గారు యల్లంపల్లి సూర్యప్రకాష్ గారు ఈ రోజు ఉదయం పరమపదించిన విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకుని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల కృష్ణమూర్తి, శ్రీకాంత్, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, శ్యామ్ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు, జనసేన నాయకులు రాందాస్ చౌదరి, మదనపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం, టిడిపి మైనార్టీ నాయకులు తాజ్ ఖాన్ పలువురు నాయకులు సూర్యప్రకాష్ గారి భౌతికకాయం నివాళులు అర్పించి వారి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరారు.
Reporter
Namitha News