Monday, 27 July 2026 01:52:28 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ముస్లిం ఐక్య వేదిక గౌరవ సలహా దారులు గా డాక్టర్ ఎస్ కె బాషా

జాతి ఐక్యతకు, అభ్యున్నతికి కృషి చేస్తానని వెల్లడి - డాక్టర్ యస్.కె. బాష

Date : 06 November 2025 07:37 PM Views : 261

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ -నవంబర్ 06 : ముస్లిం ఐక్య వేదిక అన్నమయ్య, కడప జిల్లా ల గౌరవ సలహాదారులు గా డాక్టర్ ఎస్.కె. బాషా ను నియమించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముస్లిమ్ ల ఐక్యతకు, అభ్యున్నతికి కృషి చేయాలని, ముస్లిం ఐక్య వేదిక పురోభివృద్ధి కి కృషి చేయాలని కోరారు. ఈ సందర్బంగా డాక్టర్ ఎస్.కె. బాషా మాట్లాడుతూ తన పై నమ్మకం తో ముస్లిం ఐక్యవేదిక అన్నమయ్య, కడప జిల్లాల గౌరవ సలహాదారులుగా అవకాశం ఇవ్వడం పై రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాసుమ్ వలి, కడప జిల్లా అధ్యక్షులు ఖాజా, కార్మిక విభాగం అధ్యక్షులు ఇమామ్ బాషా లకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. జాతి ని ఐక్యం చేయడానికి అలాగే విద్య, వైద్యం, రాజకీయ, సామజిక రంగాల్లో ముస్లిం సోదరులను చైతన్య పరిచి ముందుకు నడిపించ డానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ముస్లిం మధ్య పరస్పరం వున్న ఎడబాటును దూరం చేసి, అందరిని దగ్గర చేయడమే తమ ఆశయం అన్నారు. ఈ కార్యక్రమం లో మదనపల్లి నియోజకవర్గం అధ్యక్షులు ముబారక్, పట్టణ అధ్యక్షులు బావాజీ, నియోజకవర్గ సలహా దారులు ఖాదర్ బాషా పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :