నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ -నవంబర్ 06 : ముస్లిం ఐక్య వేదిక అన్నమయ్య, కడప జిల్లా ల గౌరవ సలహాదారులు గా డాక్టర్ ఎస్.కె. బాషా ను నియమించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముస్లిమ్ ల ఐక్యతకు, అభ్యున్నతికి కృషి చేయాలని, ముస్లిం ఐక్య వేదిక పురోభివృద్ధి కి కృషి చేయాలని కోరారు. ఈ సందర్బంగా డాక్టర్ ఎస్.కె. బాషా మాట్లాడుతూ తన పై నమ్మకం తో ముస్లిం ఐక్యవేదిక అన్నమయ్య, కడప జిల్లాల గౌరవ సలహాదారులుగా అవకాశం ఇవ్వడం పై రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాసుమ్ వలి, కడప జిల్లా అధ్యక్షులు ఖాజా, కార్మిక విభాగం అధ్యక్షులు ఇమామ్ బాషా లకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. జాతి ని ఐక్యం చేయడానికి అలాగే విద్య, వైద్యం, రాజకీయ, సామజిక రంగాల్లో ముస్లిం సోదరులను చైతన్య పరిచి ముందుకు నడిపించ డానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ముస్లిం మధ్య పరస్పరం వున్న ఎడబాటును దూరం చేసి, అందరిని దగ్గర చేయడమే తమ ఆశయం అన్నారు. ఈ కార్యక్రమం లో మదనపల్లి నియోజకవర్గం అధ్యక్షులు ముబారక్, పట్టణ అధ్యక్షులు బావాజీ, నియోజకవర్గ సలహా దారులు ఖాదర్ బాషా పాల్గొన్నారు.
Reporter
Namitha News