నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 19 : పుంగనూరు మండలంలోని చదళ్ల గ్రామంలో రైతు హరినాథ్ రెడ్డి పొలంలో శుక్రవారం జీవన ఎరువుల వినియోగాలపై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు హాజరై అవగాహన పొందారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జీవన ఎరువులు వినియోగించిన పంటను ప్రత్యక్షంగా పరిశీలించామని తెలిపారు. జీవన ఎరువుల వాడకంతో మొక్కలు వేగంగా ఎదిగి, ఆకులు పచ్చగా, ఆరోగ్యంగా ఉన్నాయని రైతులు తెలిపారు. రసాయన ఎరువులతో పోలిస్తే జీవన ఎరువులు పంటకు మేలు చేస్తాయని, నేల సారవంతం పెరుగుతుందని రైతులు పేర్కొన్నారు. అదేవిధంగా కాలీఫ్లవర్ సాగులో జీవన ఎరువులు వాడటం వల్ల నాణ్యమైన దిగుబడి వస్తుందని రైతులు వెల్లడించారు. ఈ రైతు అవగాహన సదస్సు బయోఫ్యాక్టర్ ఆర్ఎం గంగాధర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. బయోఫ్యాక్టర్ ప్రతినిధులు జీవన ఎరువుల ప్రయోజనాలు, వినియోగ విధానాన్ని రైతులకు వివరించారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బయోఫ్యాక్టర్ ఆర్ఎం గంగాధర్ నాయుడు, ఇన్టి సుదర్శన్ నాయుడు, ఎస్.బి. ఉదయ్ కుమార్, తదితర రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News