నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 25 : తంబళ్లపల్లె మండలం లోని గ్రామ సమాఖ్యలు హలో పేతమై తద్వారా మహిళా సంఘాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఏపిఎం గంగాధర్ సూచించారు. గురువారం వెలుగు కార్యాలయంలో మండల సమైక్య అధ్యక్షురాలు రామ లక్ష్మమ్మ ఆధ్వర్యంలో మండల సమైక్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గత ఏడాది లో మహిళా సంఘాలు ఎస్ హెచ్ జి, పొదుపు,శ్రీనిధి,ఉన్నతి రుణాలతో ఆర్థిక అభివృద్ధి సాధించి సత్ఫలితాలు రాబట్టామని భవిష్యత్తులో మహిళా సంఘాలు రెండు సౌకర్యం ఉంది వినూత్న మినీవ్యాపారాలు, వెదురు పెంపకం, పలు రకాల వ్యాపారాల పై దృష్టి సారించాలని అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువులు, కషాయాల వాడకం తో పండించిన పంటలతో పర్యావరణంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సిసిలు, కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, మండల సమైక్య సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు
Reporter
Namitha News